రాచకొండ సీపీతో టీయూడబ్ల్యుజె వినతి వదిలేది లేదని సీపీ హామీ
మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు పథకం ప్రకారమే కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి అలజడి సృష్టిస్తున్నట్లు వారు వాపోయారు. రాష్ట్రంలో సుపరిచితులైన అజయ్ లాంటి సీనియర్ పాత్రికేయులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జర్నలిస్టుల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యుజె వినతిపై స్పందించిన కమిషనర్ మహేష్ భగవత్ వెంటనే ఎల్బీనగర్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి కాల్ రికార్డస్ ఆధారంగా వెంటనే ఆగంతకులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. సీపీని కలిసిన వారిలో ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్, హెచ్యుజె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి, యూనియన్ నాయకులు బాల్ రాజ్, తేజ తదితరులు పాల్గొన్నారు.