Take a fresh look at your lifestyle.

1392 ‌జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఎస్‌పిఎస్‌సి నుంచి మరో జాబ్‌ ‌నోటిఫికేషన్‌ ‌రిలీజైంది. 1392 జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జేఎల్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు అన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. జూన్‌ ‌లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

చివరిసారి 2008లో జేఎల్‌ ‌నోటిఫికేషన్‌ ‌రిలీజైంది. అయితే పలు సంఘటనల తర్వాత 2012లో ఈ పోస్టులను భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్‌ ‌పోస్టులను అప్పట్లో భర్తీ చేశారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్‌ ‌పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో జేఎల్‌ ‌పోస్టుల కోసం ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది.

Leave a Reply