తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనాలంటూ రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో ఇచ్చే విందులో ప్రధాని మోదీతో పాటు కొందరు కేంద్రమంత్రులు మాత్రమే పాల్గొంటారు. అటు అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ముఖ్యమంత్రులకు సైతం ఆహ్వానం అందింది. ఈమేరకు 25వ తేదీ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే 25వ తేదీన రాష్ట్రపతి భవన్లో ట్రంప్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు అరుదైన అవకాశం లభించింది. ట్రంప్కు గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొనాలని రాష్ట్రపతి భవన్ నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధాని మోదీతో సహా కొద్దిమంది కేంద్రమంత్రులు, కొన్ని రాష్టాల్ర సీఎంలకు మాత్రమే ఆహ్వానం అందింది.
అందులో కెసిఆర్కు కూడా ఆహ్వానం రావడం విశేషం. రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందిన రాష్టాల్రు.. అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ మాత్రమే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 25వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 25వ తేదీ మధ్యాహ్నం ట్రంప్కు లంచ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో విందు కార్యక్రమం ముగిశాక.. రాత్రి 10 గంటల సమయంలో ట్రంప్ అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు.