“ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్న ఆకాంక్షతో 1930లో కాళోజీ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 25 సంవత్సరాల వయసులో సత్యాగ్రహోద్య మంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1940లో గవిచర్లకి చెందిన రుక్మిణీ బాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్ రెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి వారితో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించి సమ్మె చేయించారు. తెలంగాణలో అక్షర జ్యోతిని వెలిగించాలని ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన వారిలో ఈయన ఒకరు.”
నేడు కాళోజీ 107 వ జయంతి సందర్భంగా…..
నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు…
అంటూ సమాజ గొడవను తన గొడవగా మలుచుకున్న కవి ఆయన. కాళోజి పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసా రాం రాజా కాళోజి… మొదటి ప్రపంచ యుద్ధంతో తాను పుట్టింది 1914 సెప్టెంబర్ 9 అని చెప్పేవారు. కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, రట్టిహళ్ళి గ్రామంలో రమాబాయమ్మ, రంగారావు దంపతులకు ఆయన జన్మించారు. తల్లి కన్నడిగుల ఆడపడచు, తండ్రి మహారాష్ట్రీయుడు. కాళోజీ కుటుంబం చిన్నతనంలో కొన్నేళ్ళు మహారాష్ట్రలోని సాయిరామ్ లో, కొంతకాలం తెలంగాణ ఇల్లందు తాలూకా కారేపల్లిలో నివసించింది. 1917 వరకు ఆ కుటుంబం హనుమకొండలో గడిపి, తర్వాత మడికొండలో స్థిరపడింది. కాళోజి 7 నెలల వయస్సులో తల్లి రామబాయమ్మ మరణించగా ఏడు నెలల వయసులో అన్న భుజాన ఎక్కీన తాను 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన్నే ఆసరగా చేసుకొని ఉన్నానని చమత్కరించేవారు. ప్రాథమిక విద్య మడికొండలో పూర్తి చేసి తరువాత అన్నతో పాటు హైదరాబాద్ చేరుకుని పాతబస్తీలోని చౌమహల్లా కాన్గి బడిలో సెకండ్ ఫారం, తర్వాత సుల్తాన్ బజార్ రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో చదివారు. 1934 ఏప్రిల్ లో వరంగల్ కాలేజియేట్ హైస్కూలులో మెట్రిక్యులేషను పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్ న్యాయ కళాశాల నుండి పట్టా పొందారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్న ఆకాంక్షతో 1930లో కాళోజీ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 25 సంవత్సరాల వయసులో సత్యాగ్రహోద్య మంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.”
సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
బ్రతుక దలచిన పోరు
సుతరాం తప్పదు…
బ్రతుకు సాగి పోవాలంటే
పోరాటం తప్పదు
అని ఎలుగెత్తి చాటిన ధిక్కార స్వరం ఆధునిక కవి కాళోజీ.

తెలంగాణ భాష, అందులో యాసలు కాళోజికి చాలా ఇష్టం. తెలుగు భాష అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించిన మొత్తం భాషగా పరిగణించారు. ఆయన ఒక ప్రాంతం భాషను, సంస్కృతిని ఉన్నతీకరించి, మరొక ప్రాంతానికి చెందిన భాషను కించపరచడం వ్యతిరేకించి కోస్తా పండితులతో తలపడిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలోని కోస్తాంధ్ర,రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ మాండలికలను గౌరవించేవారు, భాష యాసలను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలంటూ, బడి పలుకుల భాష, నిత్యం జనం వాడే పలుకుబడుల భాష అంతే, వ్యవహారిక భాష అని చెప్పేవారు. వ్యవహారిక భాష, జీవభాష వైపే మొగ్గు చూపారు..

ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్. మహబఃబాద్ జిల్లా. 9989584665