ఘటనా స్థలాన్ని పరిశీలించిన జగిత్యాల ఎస్ పి సింధు శర్మ
ప్రజాతంత్ర, జగిత్యాల రూరల్, జనవరి 20 : జగిత్యాల అర్బన్ మండలంలోని టి ఆర్ నగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అతి దారుణంగా గురువారం హతమార్చారు. టి ఆర్ నగర్ కాలనీకి చెందిన తండ్రి తో పాటు ఇద్దరు కొడుకులను అతి కిరాతకంగా వేటకొడవళ్లతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. తండ్రి నాగేశ్వర్ రావు (50), కొడుకు రాంబాబు (40) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో కొడుకు రమేష్(30) పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని జగిత్యాల ఎస్ పి సింధు శర్మ, అడిషనల్ ఎస్పీ రూపేష్ కుమార్, డి.ఎస్.పి రత్నా పురం ప్రకాష్ లు పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ టీం చేరుకుని పరిసరాలను పరిశీలించి ఒడికట్టిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు.. ఈ ఘటనతో తారకరామా నగర్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా స్థానికుల సమాచారం ప్రకారం ఈరోజు ఎరుకల కులస్తుల సమావేశం జరిగిందని మంత్రాల నెపంతో నే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికుల ద్వారా సమాచారం. కాగా మంత్రాల నెపంతో నా , పాత కక్షలే కారణమా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.