హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
కేసీఆర్ ను జాతీయ స్థాయిలో రాకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్పోర్టస్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఏపీలో చదువురాని వారిని కూడా హెల్త్ మినిస్టర్లను చేశారని..కేసీఆర్ అన్ని అంశాల ద పట్టున్న వారికి పదవులిస్తున్నారని చెప్పారు. అందరికీ పదవులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో క్రీడా పాలసీని తీసుకొస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో సకలజనుల సంపద పెరిగి ఆనందంగా ఉన్నారని తెలంగాణ స్పోర్టస్ అథారిటీ ఛైర్మన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ అన్నారు. సంపద పెరిగింది కాబట్టి గ్రామాలు ఆనంద నిలయలుగా మారాయని చెప్పారు. ప్రతి రంగాన్ని సిరుల రంగంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
వెయ్యికి పైగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. ఈ 8 ఏళ్లలో కేంద్రం సహకరించకపోయిన కేసీఆర్ అన్ని అడ్డంకులను అధిగమించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆంజనేయ గౌడ్ కొనియాడారు. క్రీడా రంగానికి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగాన్ని దేశానికే తల మానికంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తానని ఆంజనేయ గౌడ్ అన్నారు.ఉద్యమకారులకు సముచిత గౌరవం
ఆంజనేయులుగౌడ్ను అభినందించిన కవిత
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్తో నడిచిన ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతోందని
ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకొని అభివృద్ధి వైపు వెళ్తున్నామన్నారు. తెలంగాణ స్పోర్టస్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయ గౌడ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని కవిత అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేలా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో ఉద్యమకారుడు ఆంజనేయులు గౌడ్ను ప్రభుత్వం గుర్తించి నియమించిందన్నారు. ఆయనును కవిత అభినందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు.