‘‘నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్ గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’
నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్ గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.
ఇక్కడి ప్రజలు చదువుకొని జ్ఞానం సంపాదించి ఆర్థికంగా బాగుపడితే మా బంగ్లాల గడపల కాడ కూర్చునేవారెవరని ఒక కుట్రపూరితంగా ఈ ప్రాంతానికి మెరుగైన విద్యను అందించకుండా విద్యాలయాలను తీసుకరాకుండా కుట్ర చేశారు.వీరి డెబ్బై యేండ్ల పాలనలో అక్షరాస్యత పరంగా దక్షిణ ఆసియా ఖండంలోనే గట్టు మండలం అత్యంత వెనుకబాటుతనానికి గురైందన్నా,తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం చివరి స్థానంలో ఉందన్నా విద్యపై వీరికున్నా చిత్తశుద్ది ఎంటో తెలుస్తుంది.
విద్వత్ గద్వాలగా పేరుగడించిన ప్రాంతంలో న్యూడ్ కాల్స్ వ్యవహారంతో అనేక మంది మహిళల జీవితాలను చిదిమేసి రాష్ట్రవ్యాప్తంగా గద్వాల పేరును తలదించుకునేలా చేశారు ఈ పాలకులు. ప్రస్తుత అధికార పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా,తమ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిసిన గుంతల మయమైన రోడ్లు, అధ్వానమైన గ్రామాల అభివృద్ధి, చేనేత పార్క్ హామీ,బస్టాండ్ ఆధునీకరణ,గుర్రంగడ్డ బ్రిడ్జి,300 పడకల ప్రభుత్వ దవాఖాన, కుల భవనాలు,జూరాల ప్రాజెక్టు దగ్గర పార్క్, గట్టు ఎత్తిపోతల పథకం వంటి హామీలతోపాటు గద్వాలకు చెందిన అనేక ఆఫీసులు వనపర్తి జిల్లాకు తరలివెళ్లిపోతున్న కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఈ కుటుంబ పాలనలో ఈ ప్రాంత ప్రజలు నలిగిపోయినది చాలు.గతాన్ని, వర్తమానాన్ని మనం పోగొట్టుకున్నది చాలు.రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే అభివృద్ధి సంక్షేమం అన్ని వర్గాలకు అంది మన బహుజనులంత ఆత్మగౌరవంతో బతకాలంటే వీరి అహంకార పూరిత కుటుంబ పాలనను అణిచి వేయాలంటే వోటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాల్సిందే.
గొంగళ్ల రంజిత్ కుమార్
నడిగడ్డ హక్కుల పోరాట సమితి
చైర్మన్, జోగులాంబ గద్వాల జిల్లా.
9885954118.