Take a fresh look at your lifestyle.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి..

  • రాజ్యాంగవాదులు, అంబెడ్కర్ వాదులు ఏకం కావాలి
  • అంబెడ్కర్ రాజ్యాంగం వల్లే అందరికి సమాన అవకాశాలు
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
సార్వభౌధికారం, సౌభ్రాతృత్వంతో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేలా రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబెడ్కర్ అందించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో ఆయన విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. అంబెడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాయని అన్నారు. ఇప్పుడు దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని కాలరాసి వారి రాజకీయ విధానాలను దేశం మీద రుద్దేలా ప్రయత్నాలు చేసున్నాయని అన్నారు.
Ambedkar
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలింగించే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య వాదులు, అంబెడ్కర్ వాదులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ జాతి నిర్మాణాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. 
అలా 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా నిర్మించిన దేశాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగున్నాయి.. దీనిని కచ్చితంగా నిలువరించాలని భట్టి విక్రమార్క చెప్పారు.

Leave a Reply