Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలకు ఎల్‌ఈడి టివి అందజేత

the public school, LED TV Presenter, rsi srikanth, siddipetసిద్ధిపేటకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ‌శ్రీకాంత్‌ ‌మంచి మనసును చాటుకున్నారు. సిద్ధిపేటలోని ప్రశాంత్‌నగర్‌, ‌హనుమాన్‌నగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలకు ఎల్‌ఈడి స్మార్ట్ ‌టివిలను అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేటలోని సిఏఆర్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. తన కూతురు చేతనశ్రీని ఎంపిపిఎస్‌ ‌ప్రశాంత్‌ ‌నగర్‌ ‌హనుమాన్‌ ‌నగర్‌ ‌ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌కేజీ చదివిస్తున్నాడు. తరచుగా పాఠశాలకు తన కూతుర్ని దించడానికి వెళ్లే శ్రీకాంత్‌కు..స్కూల్లోని పిల్లలకు సాంకేతిక విద్య గురించి టివి లేదన్న విషయాన్ని గమనించాడు. తనంతట తాను స్వయంగా ఎల్‌జి స్మార్ట్ 32 ఇం‌చెస్‌ ఎల్‌ఈడి 17 వేల రూపాయలు విలువ గల టివిని కొనుగోలు చేసి మంగళవారం సిద్దిపేట అర్బన్‌ ఎంఈవో యాదవ రెడ్డి, స్కూల్‌ ‌హెడ్మాస్టర్‌ ‌రాజు, సమక్షంలో పాఠశాలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఈవో యాదవ రెడ్డి మాట్లాడుతూ..ఆర్‌ఎస్‌ఐ ‌శ్రీకాంత్‌ ‌తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే కాకుండా… స్కూల్‌కు ఎల్‌ఈడీ టివిని విరాళంగా అందజేసి శ్రీకాంత్‌ అం‌దరికి ఆదర్శంగా నిలిచినందుకు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా శ్రీకాంత్‌ ‌ను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఉపాధ్యాయులు, సత్యనారాయణ, హనుమాన్‌ ‌నగర్‌కు చెందిన టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Tags:  the public school, LED TV Presenter, rsi srikanth, siddipet

Leave a Reply