- ఉద్యోగ సంఘాలు ఇప్పుడు కనీసం మాట్లాడే పరిస్థితుల్లో లేవు
- కాంగ్రెస్ ఎమ్ఎల్సి జీవన్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలను శాసించేవారని, ఇప్పుడు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని ఏపీ జగన్ 27 శాతం మధ్యంతర భృతి పెంచారని, కనీసం తోటి ముఖ్యమంత్రిని చూసైనా నేర్చుకోవాలని కేసీఆర్కు సూచించారు. ఉద్యోగ సంఘాల పేరుతో శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యాడని ఎవరి వల్ల మంత్రి అయ్యాడో వారి మేలు చూసుకోవాల్సిన బాధ్యత శ్రీనివాస్ గౌడ్కు లేదా అని ప్రశ్నించారు…?
ఉద్యోగుల హక్కుల కాలరాస్తున్న ప్రభుత్వంలో కొనసాగే హక్కు శ్రీనివాస్ గౌడ్కు ఎక్కడిదని, వారి హక్కుల కోసం పోరాటం చేయకపోతే ఎలా అని మండిపడ్డారు. ఉద్యోగుల వేతన సవరణ ఐదేళ్లకోసారి చేస్తారని, అది ఉద్యోగుల హ్కని, 10వ ఫైనాన్స్ కమిషన్ జూన్తో ముగుస్తుందని, 11వ క•మిషన్ జులైలో మొదలౌతుందని, 2008 లోనే బిస్వాల్ కమిషన్గా కమిషన్ వేశారని, 2018లో నూతన పీఆర్సీ అమల్లోకి వస్తుందని తాము భావించామని, ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉద్యోగ సంఘాలను ప్రగతి భవన్కు పిలిచారని, సత్వరమే పీఆర్సీ వస్తుందని చెప్పారని కానీ తీరా చూస్తే డిసెంబర్ 31 వరకు కమిషన్ గడువు పొడగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.