పోతన ఘంటం,రుద్రమదేవి శౌర్యం తెలంగాణ నేలను పులకరింప చేసింది. దాశరథి కలం తెలంగాణ స్వరాన్ని ఇనుమడింపచేసింది. సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనింప చేసింది. కాళోజీ కవిత్వం నిజాం దమననీతిని దునుమాడింది. కొమరం భీమ్ ప్రాణత్యాగం తెలంగాణ గడ్డను పునీతం చేసింది.చాకలి ఐలమ్మ భూమి,భుక్తి పోరాటం జనవాహినిలో చైతన్యం రగిలించింది. షోయబుల్లా ఖాన్ రక్తతర్పణం రజాకార్ల గుండెలను హడలెత్తించింది.
– సుంకవల్లి సత్తిరాజు
మొ:9704903463