- స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాల మూసివేత
- రైతుల ఆందోళనలన అడ్డుకున్న పోలీసులు
- ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి తరలింపు
కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ ఉద్రిక్తంగా మారింది. రైతులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్ పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక ఇచ్చిన బంద్ కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్లో వ్యాపార సంస్థలను మూసి వేయించారు. మరోవైపు వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. వ్యాపార సంస్థలను మూసేసారు. బందుకు మద్దతుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. దీంతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పోలీసులు అప్రమత్తం అయి వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత ఆయనను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు చనిపోయిన ఎల్లారెడ్డి రైతు పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే కామారెడ్డి బంద్ కు బీజేపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్స్టలెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీంతో డ్రాప్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్లాన్లో ఇక్కడ 8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్టీయ్రల్కింద ప్రతిపాదించారు.
ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్ హైవే పక్కన..టౌన్ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే భూములు ఉండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్టియ్రల్ జోన్లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్రాదని, నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా.. తమకు చెప్పకుండా మాస్టర్ప్లాన్ ఎలా తయారు చేస్తారంటూ రైతులు నిలదీస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన దా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నయకుల వెంచర్లకు ఉపయోగపడేలా ఈ రోడ్డు ప్రపోజ్ చేశారని, దీని వల్ల తమ విలువైన భూములు పోతాయని అంటున్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. మున్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నా, కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల ఘెరావ్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడి, భిక్షాటన వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం నుంచి మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నారు.
అడ్లూరు ఎల్లారెడ్డి రైతు రాములు అత్మహత్య చేసుకోగా బుధవారం డెడ్బాడీతో ఆందోళన చేశారు. గురువారం రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్ప•హ తప్పి పడిపోయారు. ర్యాలీలు, ధర్నాలతో దాదాపు 10 గంటల పాటు కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం, తన భూమి ఇండస్టియ్రల్ జోన్లోకి పోతే తనకు నష్టం జరుగుతుందన్న ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు.
కెసిఆర్ పతనానికి నాంది
కామారెడ్డి రైతుల ఆందోళనపై లక్ష్మణ్![image.png]()
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి 6: కామారెడ్డిలో రైతుల ఆందోళన కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. వారి భూములను లాక్కునే కుట్రలను వారే తిప్పి కొట్టారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. శుక్రవారం డియాతో మాట్లాడుతూ… రైతులను మంత్రులు ఎగతాళి, వ్యంగ్యంగా మట్లాడటాన్ని బీజేపీ నేత ఖండించారు. దొడ్డి దారిన కాకుండా.. గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్.. రైతుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేస్తోందని తెలిపారు.
కామారెడ్డి రైతుల ఆందోళనపై లక్ష్మణ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడుతామన్నారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో.. మిషన్ 90లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. ఏప్రిల్లో కేసీఆర్ ప్రభుత్వంపై అమిత్షా ఛార్జ్షీట్ విడుదల చేస్తారని తెలిపారు. సంక్రాంతి తర్వాత ప్రజా సమస్యలపై మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. తెలంగాణను కాపాడుకోవటం కోసం మేధావులు, కవులు, కళాకారులు స్పందించాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రైతుబంధు పేరు ద కేసీఆర్ ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం మాత్రమే రైతులకు న్యాయం చేస్తోందని లక్ష్మణ్ తెలిపారు.
రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఆందోళన
భూములు గుంజుకుంటే ఊరుకోమన్న షబ్బీర్ అలీ
భూములు గుంజుకుంటే ఊరుకోమన్న షబ్బీర్ అలీ
కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: కామారెడ్డి రైతులకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ అవమానించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో కలసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.మరోవైపు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ర్యాలీలు, ధర్నాలతో దాదాపు 1కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు. రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పేరు ద కేసీఆర్ ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. కామారెడ్డిలో రైతుల భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదన్నారు.