ఎమ్మార్వోకు మండల టిడిపి నేతల వినతిపత్రం
ఒంగోలు,జూన్16 : కోవిడ్ విపత్కర పరిస్థితిలో కరోనాతో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించాలని ప్రకాశం జిల్లా పొదిలి మండల టిడిపి నేతలు బుధవారం తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గడ ఓబుల్ రెడ్డి, పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, ఒంగోలు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తెలుగుదేశం నాయకులు ఎస్ఎం.బాషా, షేక్ డాక్టర్ ఇమాంసా, పండు చికెన్ అధినేత పండు, మాజీ వార్డ్ మెంబెర్ జ్యోతి మల్లికార్జున, మాజీ ఎంపిటిసి నరసింహరావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
నందగామలో టిడిపి నిరసన ప్రదర్శన
విజయవాడ,జూన్16 :వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి చేయాలని, అన్నా క్యాంటీన్ తెరవాలని, జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ… టిడిపి ఆధ్వర్యంలో నందిగామ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నందిగామ మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… కరోనా థర్డ్ వేవ్ ను తట్టుకోవడం కోసం వ్యాక్సిన్ పక్రియ పూర్తి చేయాలని, అన్నా క్యాంటిన్ తెరవాలని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి రూ.50 లక్షల బీమా ఫ్రీమియం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యండ్రపల్లి శ్రీనివాసరావు, వ్డడెల్లి సాంబశివరావు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.