Take a fresh look at your lifestyle.

సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌ఫలితాల్లో మెరిసిన తెలంగాణ

అఖిల భారత సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌ఫలితాలలో తెలంగాణ అభ్యర్థులు అసమాన ప్రతిభ కనబరిచారు. యూపీఎస్సీ 2019 ఫలితాలలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. అఖిల భారత స్థాయిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన పి.ధాత్రి రెడ్డి 46వ ర్యాంకును, హుజూర్‌నగర్‌కు చెందిన పి.సందీప్‌ ‌వర్మ 244వ ర్యాంకును సాధించారు. వీరిద్దరినీ మంత్రి జగదీష్‌రెడ్డి అభినందించారు. అఖిల భారత స్థాయిలో తెలంగాణ అభ్యర్థులు చాటిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

అలాగే, 218వ ర్యాంకు సాధించిన చౌటుప్పల్‌ ‌మండలం తంగేడుపల్లికి చెందిన బి.సత్యప్రకాశ్‌గౌడ్‌•, 417‌వ ర్యాంకు సాధించిన నల్లగొండ పట్టణానికి చెందిన ఆర్‌.‌శీతల్‌ ‌కుమార్‌ను కూడా ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అభినందించారు. కాగా, సివిల్స్ ‌ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 110వ ర్యాంకు సాధించి సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు అభినందనలు తెలిపారు. మకరంద్‌ ‌తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో ఇనుమడింపజేశారని ఈ సందర్భంగా హరీష్‌రావు ప్రశంసించారు.

Leave a Reply