- ద్రోహులు రాజ్యమేలుతున్నారు
- రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటారు
- కేసీఆర్ డబ్బులు నమ్ముకున్నారు
- పాదాయాత్ర మళ్లీ మొదలు పెడతా
- ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల రాజేందర్
- హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యమ సహచరులు కనుమరుగై.. ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని అన్నారు. మానుకోటలో మా రక్తాన్ని కళ్ళ చూసిన కౌశిక్ రెడ్డికి.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉద్యమకారుల గుండెల్ని గాయాలు చేశారని అన్నారు. 2018లో కౌశిక్ రెడ్డి కేసీఆర్ కోవర్ట్గా పని చేసినందుకు.. అయనకు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్లుందని విమర్శించారు. రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటారు కానీ కేసీఆర్ డబ్బులు నమ్ముకున్నారని అన్నారు. ఇప్పటికే రూ.150 కోట్లు నగదు రూపంలో హుజురాబాద్లో నాయకులకు ఇచ్చారని.. ఇలాంటి ప్రభుత్వాన్ని భరిద్ధామా? అంటూ ప్రశ్నించారు.
ఇక ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చేస్తుండగా నాయన ఆరోగ్యం క్షీణించి జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతూ వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారు. దీంతో హైద్రాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈటల అనారోగ్యం పాలవడంతో పలువురు నాయకులు హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. తన కున్న ఆప్షన్ పాదయాత్రేనని..పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత మొదలు పెడతానని స్పష్టం చేశారు. 5 రోజులుగా తాను బాగుండాలని పూజలు చేసి దీవించిన హుజూరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.