“మనం ఒకరి పై ఆరోపణ చేస్తున్నాం అంటే విచారణకు నిలబడగలిగే ప్రాధమిక ఆధారాలు ఉండాలి. లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా బురద జల్లారు అని ప్రత్యర్ధులు ఎదురుదాడి చేయటానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయంలో టీడీపీ,చంద్రబాబు ఏం జాగ్రత్తలు తీసుకున్నారో, వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఇప్పటికైతే మనకు తెలియదు. ఈ క్రమంలో సీనియర్ నేత యనమల వాదన కాస్త వింతగానే ఉంది. ప్రభుత్వమే దోషి కనుక…ఆధారాలు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని యనమల వాదన”
