Tag Telugu literature

ఎడారి వసంతం -యండి. ఉస్మాన్ ఖాన్

నిశ్శబ్దపు నిప్పుల కొలిమిలో నిలువెల్లా దహిస్తున్న ఇసుక తివాచీపై ప్రాణం గుక్కపట్టుకుని ఎదురుచూస్తోంది ఒక్క చినుకు స్పర్శ కోసం, ఒకే ఒక్క ఆశ కోసం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా కాలం కన్నీళ్లు ఇంకిపోతున్నా కాలిపోయే నేల గుండెల్లోంచి పచ్చని తపన పలకరిస్తోంది ఇది కేవలం ఇసుక సముద్రం కాదు ఓటమితో పోరాడే జీవన సమరం కాలిపోయిన…

మృగయా -మణి వడ్లమాని

ఆఫీస్ పనిమీద కలకత్తా వచ్చిన గౌతమ్ కి అక్కడి గెస్ట్ హౌస్‌లో ‘సోనూ’ పరిచయమయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ కుర్రాడి అసలు ఊరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్‌బన్స్ లోని మడ అడవులలో  చిన్నదీవిలో.  ట్రైనింగ్ సెషన్స్ అయ్యాక  రోజు సోనుతో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. ఆ రోజు సాయంత్రం సోనుని తీసుకుని బజారుకు…

‘అర‌సం’ నుంచి ‘విర‌సం’ వ‌ర‌కు తెలుగు సాహిత్య ప్ర‌స్థానం

” ‘భావ కవిత్వం’ నుండి ‘విరసం’ వరకు సాగిన తెలుగు సాహిత్య ప్రస్థానం, సంప్రదాయం-ఆధునికత, భక్తి-తిరుగుబాటు, వ్యక్తివాదం-సమ‌ష్టివాదం వంటి విభిన్న ధోరణుల మధ్య జరిగిన చైతన్యవంతమైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి దశ కూడా తెలుగు మాట్లాడే ప్రజల మారుతున్న ఆకాంక్షలను  పోరాటాలను అద్దం పట్టి చూపింది. క్రమంగా, సాహిత్యం వర్గ పోరాటానికి ఒక ఆయుధంగా రూపుదిద్దుకుంది;…

అంత్యకాలం!

మెరుపు తీగెలు  “చంపేశారు!”           “ఎలా?”           “కొట్టి చంపేశారు!”           “మనుషులేనా?”           “మనుషులే మనుషుల్ని కొట్టి చంపేశారు!”           “తప్పుకదా?”           “కాదనే అంటున్నారు!”           “ఎందుకు?”           “అతను అన్యమతస్తుడు!”           “కాదు, అతను మన హిందువేనట కదా?”           “కావచ్చు, కాని అతను మతం మారాడు మరి!”           “పాపం!”           “ఊ… పాపమే చేశాడు…”           “పాపమే యెందుకు చేశాడు?”           “కష్టాలు తీరుతాయని మతం మారాడు!”           “కాని…

మన తెలుగు ‘వాల్ట్ విట్మన్’

సంజయ్ ఖాన్ ఈమధ్యే వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల చదవడం పూర్తయ్యింది. ఇదొక జ్ఞాపకాల దొంతర. మనిషికి ప్రకృతితో ఉన్న అంతరార్థాన్ని తెలియజెప్పే బహిరంగ సంభాషణ. చదువుతున్నంతసేపు అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ నా పక్కనే ఉన్నట్లు, ఆయన ఆత్మ ఈ పుస్తకంలో పరిమళిస్తున్నట్లు అనిపించింది. చదివిన తరువాత విట్మన్ కు, భద్రుడికి మధ్య ఉన్న…

సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు…

విశ్వ సాహిత్య దృష్టితో తెలుగు కలం – ముక్తవరం

“సాహిత్యం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కానీ కొన్ని రచయితలు కాలాన్ని మించి నిలుస్తారు. ముక్తవరం పార్థసారథి అలాంటి వారిలో ఒకరు. ఆయన రచనల్లో కనిపించే మానవీయ విలువలు, భాషాపట్ల గల గౌరవం, సమాజంపై చూపిన బాధ్యతాభావం ఇవన్నీ నేటి తరానికి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఆయన లేని లోటు భౌతికమైనదే గాని, ఆలోచనాత్మకంగా ఆయన…

ఏకలవ్య కాలనీ కథలకు కొలకలూరి భాగీరథి పురస్కారం

రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల  నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…