విడుదల చేసిన ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం టాగూర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చెప్తూ …ఇప్పుడు గ్రేటర్లో అధికారం ఇస్తే కాంగ్రెస్ చేసే అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందుపరిచారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొనగా మేనిఫెస్టోని ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు పూర్తిగా స్టడీ చేశామని, బడ్జెట్ కూడా సమకూరుస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు..
విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం..ప్రైవేటు విద్యాసంస్థల ఫీజల నియంత్రణకు చర్యలు..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపు…అర్హత కలిగిన వారందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తాం…సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం…వరదల నివారణకు అత్యున్నత విధానం తీసుకొస్తాం…ఉచిత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలు చేస్తాం..నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తాం…ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం…మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం…సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20లక్షల బీమా సదుపాయం…కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ..కోవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్లు.