ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీమ్కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టం(2017)ను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, ‘‘హైదరాబాద్ జిందాబాద్’’ అధ్యక్షులు పాశం యాదగిరి సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్ తరపు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి వాదనలు విన్న చీఫ్ జస్టిస్ శరత్ బాబ్డే నాయకత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.