ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో విక్రేతలు, పండ్లు, కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు , మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించి , సూపర్ స్ప్ర్లెర్లు్ల అందరికీ టీకాలు వేసే అంశంపై చర్చించారు. సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ మరియు డైరెక్ట యన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.