Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవితను కలిసిన స్టేట్‌ ‌టూరిజం ఛైర్మన్‌ ఉప్పల

సిద్ధిపేట, డిసెంబర్‌ 11 (‌ప్రజాతంత్ర బ్యూరో): టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ముఖ్యమైన నాయకురాలు, సిఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిద్ధిపేటకు చెందిన రాష్ట్ర టూరిజం శాఖ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్తా శనివారం కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా నుంచి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైంది. ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని స్టేట్‌ ‌టూరిజం శాఖ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్తా కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply