- నేరుగా క్వారంటైన్కు తరలించేలా ఏర్పాటు
- కలెక్టర్ ఇంతియాజ్
విజయవడ,మే 9 : విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోను ందన్నారు. ముంబాయి నుంచి హైరారబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు,అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు.
వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.ఆయన శనివారం డియాతో మాట్లా డుతూ..ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పా ట్లు పూర్తి అయినట్లు చెప్పారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్పోర్టుకే వస్తారని ఆయన చె ప్పారు.14 రోజులపాటు క్వారెంటైన్కు తరలి స్తామన్నారు.ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు.విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నా రు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు.14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపు తామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం,పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు. పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.ప్రభుత్వం రూపొందించిన ప్రత్యే క యాప్ని వినియోగిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.