శ్రీవారిని దర్శించుకున్న రాష్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. తేదీలు ఇంకా ఖరారు కాలేదనీ, నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. కాగా, వచ్చే ఫిబ్రవరి మొదటివారం జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల పక్రియను ప్రారంభించింది.
కొవిడ్-19 నేపథ్యంలోబ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపాయి. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మంత్రి కెటిఆర్ కూడా నవంబర్లోనే ఎన్నికలు రావచ్చని సూచించారు. నగర నేతలతో సవి•క్ష సందర్భంగా కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్ఫుడు కమిషనర్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో నవంబర్లోనే గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుందని తెలుస్తోంది.