Take a fresh look at your lifestyle.

రాష్ట్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం

ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి
ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. జూన్‌ 8‌న వొచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌, అతని సోదరుని మధ్య భూవివాదం ఉంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుకుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాలు గతంలో ఉన్నప్పటికీ తాజా ప్రతియేటా సమర్పించాలని ఆదేశించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరినీ దోషులుగా ఆపాదించడం కరెక్ట్ ‌కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడంపై మండిపడుతున్నాయి. స్థిర, చర ఆస్తులు అమ్మినా..కొన్నా..ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ ‌సమర్పించాలని సూచించింది. టీచర్లకు, ఉద్యోగులుకు ఇన్‌‌స్ట్రక్షన్‌ ఇవ్వాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర, చర ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. ఇన్నేళ్లు ఉపాధ్యాయుల విషయంలో అంతగా పట్టించుకోని విద్యాశాఖ..నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో విద్యాశాఖ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply