Take a fresh look at your lifestyle.

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్‌ ‌శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్‌ ఈ-‌సేవా కేంద్రం, ఇంటర్నెట్‌, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.

Leave a Reply