Take a fresh look at your lifestyle.

ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి

బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి
దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
కేంద్ర సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు
కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
‌డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం
ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఏడున్నరేళ్లుగా కేంద్రం నుంచి సహాయ, సహకారాలు లేవని తెలిపారు. ఈసారి బ్జడెట్‌లోనైనా విభజన హాలు అమలు చేయాలని, తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్‌ ‌కోరారు. దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వొస్తాయని తెలిపారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ..రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమన్నారు. తమ హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్‌ ‌ప్రకటించారు.

రాష్ట్రం ప్రగతి పథాన దూసుకుపోతున్నా…కేంద్రం నుంచి సహకారం మాత్రం దక్కడం లేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలో… మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం…..సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ‘ఏడున్నరేళ్లుగా సహకారం లేదు..ఈసారైనా విభజన హాలు అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థకు చెందిన తయారీ యూనిట్‌ ‌ప్రారంభం కాబోతుంది. ఆయిల్‌ ‌డ్రిల్లింగ్‌, ‌రిగ్‌ ‌సెక్టార్‌లో ప్రపంచస్థాయి కంపెనీగా వెలుగొందుతున్న… డ్రిల్‌ ‌మెక్‌స్పా …. రాష్ట్రంలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్‌….80‌శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని…హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడం… రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇటలీ, యూఎస్‌ ‌వంటి దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం…అందులోనూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం…ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. దేశంలో నాలుగో అతిపెద్ద ఎకాన కంట్రిబ్యూటర్‌గా తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతున్నా…. కేంద్రం నుంచి సహకారం కరవైందని కేటీఆర్‌ ఆక్షేపించారు. బడ్జెట్‌ ‌ప్రవేశపెడుతున్న దృష్ట్యా….హాలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పదేపదే సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ అం‌టున్నారని… రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. కేవలం నినాదంతో మేకిన్‌ ఇం‌డియా సాకారం కాదు.

అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్‌గా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ ‌పార్క్‌కు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌.. ‌హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ ఏర్పాటుచేయబోతున్నాం. కేంద్రం నుంచి వీటికి సాయం కోరినా స్పందన లేదు. 6 కొత్త ఇండస్ట్రియల్‌ ‌కారిడార్లు ఏర్పాటుచేయాలని కోరాం. అది కూడా కార్యరూపం దాల్చలేదు. సైద్దాంతిక, రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రంపై వివక్ష చూపితే సంక్షోభం తలెత్తుతుంది. దేశంలో పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సంకల్పానికి విఘాతం కలుగుతుందని కెటిఆర్‌ అన్నారు. ఆయిల్‌, ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్‌ ‌స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500ల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌ట్విటర్‌ ‌వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్‌మెక్‌స్పా సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply