24 గంటల్లో కొత్తగా 710 మందికి పాజిటివ్..నలుగురు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 808 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా నలుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 80 కేసులు నమోదవగా, జిహెచ్ఎంసి పరిధిలో 71 కేసులు, నల్లగొండ జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,34,605 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,747కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,20,757 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 10,101గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.