Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 196 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. క్రితం రోజు 184 కేసులు నమోదవగా తాజాగా మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 196 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 184 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు.

జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 78 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 20 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,75,994 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,992కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,68,411 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,591గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply