Take a fresh look at your lifestyle.

ఏకకాలంలో దాబాలపై దాడి

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని 65వ జాతీయ రహదారి జనగామ క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద ఉన్న పలు ధాబాలను గురువారం జిల్లా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ ‌కృష్ణమూర్తి, బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు, వంటగదిలో అపరిశుభ్రంగా ఉన్న ధాబాలకు భారీ జరిమాన విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు హైదరాబాద్‌, ‌విజయవాడకు వెళ్లే వాహనాలు నిత్యం వేలల్లో ఉంటాయి.

అలాగే జిల్లా పరిసర ప్రాంతాల ధాబాకు వచ్చి పొతుంటారని తెలిపారు. నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలు అం దించాలని సూచించారు. నిల్వ ఉంచిన పదార్థాలను ఉపయోగించకూడదని హెచ్చరించారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆయనతోపాటు ఎన్విరాన్‌మెంట్‌ ఇం‌జనీర్‌ ‌శివప్రసాద్‌, ‌హెల్త్ అసిస్టెంట్‌ ‌సురేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply