Take a fresh look at your lifestyle.

నియోజకవర్గానికి రూ.2కోట్లతో సీసీ రోడ్లు

Secy Roads,Rs 2 crore per,constituency,mla Sathishkumar.jgp
‌పంచాయతీరాజ్‌ అధికారులకు సుచనలిస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌
  • త్వరితగతిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం
  •  అన్నిరంగాల్లో అభివృద్ది చేయడమే నా అభిమతం
  •  హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ 

హుస్నాబాద్‌,: ‌హుస్నాబాద్‌ ‌నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయనీ ఈ రోడ్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేయించామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ అన్నారు.ఏడు మండలాల్లో ఈజీఎస్‌ ‌ద్వారా ఇప్పటికే రూ.5 కోట్లతో నిర్మాణమౌతోన్న సీసీ రోడ్లే కాకుండా మరో రూ.2 కోట్లతో రోడ్లు నిర్మాణం గావించాలని అందుకు ప్రతిపాదనలు సిద్దం చేసి వారం రోజుల్లో పనులు మెదలు పెట్టాలని పంచాయితీ రాజ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు బుధవారం నాడు సదరు అధికారులతో ఏడు మండలా ల్లో ఏయే గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేయాలన్న అంశంపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్‌ ‌బాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చింతర్వాతే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.అంతకుముందు గ్రామాలను పట్టించుకున్న నాథుడే లేడనీ గ్రామాల్లో వర్షాలు పడితే బురదమయమై ప్రజలు బయటకి రాని దుస్థితి ఉండేదన్నారు.ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తోందనీ నియోజకవర్గం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుండేలా అభివృద్ది చేయడమే తమ అభిమతమని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా  నియో జకవర్గంలో యువత ఉద్యోగం ఉపాది లేక గ్రామాల చావళ్ల వద్ద అడ్డ లుంగీలు కట్టుకొని సమయం వృదా చేసే క్రమంలో దాన్ని రూపు మాపేందుకే వేలాది మందికి ఉచిత వసతి ఏర్పాటు చేసి నిష్ణాతులైన శిక్ష కులతో పోలీసు శిక్షణ ఇప్పిస్తే శిక్షణ పొందిన దాదాపు 87 శాతం యువకులు ఉద్యోగం సాధించారు.

Tags: Secy Roads,Rs 2 crore per,constituency,mla Sathishkumar

 

 

Leave a Reply