సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న వారికి ఇది కనిపించలేదా అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ కావాలనే చేయించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. నల్గొండ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీలు, కార్యవర్గ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు..
ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారం అన్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల పర్యటనలలో ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేయిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి వి టీఆర్ఎస్ పార్టీ సొత్తా..? వేరే పార్టీ వాళ్లు రాకూడదా ? అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని విమర్శించారు. ఈ దేశానికి సేవ చేయాలినుకునే అభ్యర్డులు ఇతరుల మాట విని తప్పుదోవ పట్టొద్దని ఆయన హెచ్చరించారు. ఎంతోమంది మేధావుల ఆలోచనలు, సవి•క్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ అన్నారు.
ప్రతిపక్షాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మిలిటరీ మారుతూ ఉంటుందని.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుంటుందని పేర్కొన్నారు. వొచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు జిల్లాకు లక్షమంది చొప్పున తరలించడానికి అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహిస్తున్నామని రఘునందన్ రావు తెలిపారు.
తెలంగాణపై బిజెపి ఫోకస్ : ఎంఎల్ఏ ఈటల
బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై సీరియస్గా ఫోకస్ చేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వొచ్చేందుకు అమిత్ షా కార్యాచరణ రూపొందించారని, దాన్ని తనకు వివరించారని చెప్పారు. అమిత్ షా పిలుపు మేరకు తాను దిల్లీ వొచ్చానని, ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యానని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చే కార్యాచరణపై చర్చించామన్నారు.