ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ ,జూలై 28: ఏపీ, తెలంగాణ సీఎంలు రహస్య ఏజండాతో పని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. పార్టీల ప్రయోజనాల కొరకు కేసీఆర్, జగన్ లు తెలుగు ప్రజల సెంటిమెంట్ వాడుకుంటున్నారన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.రెండు తెలుగు రాష్ట్రాల తీరుతో కృష్ణ, గోదావరి నదుల బోర్డుల పరిధి పై కేంద్రం గెజిట్ విడుదల చేసిందన్నారు.
అయితే, గెజిట్ తో నది జలాల అధికారాలను హక్కులను కేంద్రం తన చేతిలోకి తీసుకోవడం సమాఖ్య స్పూర్తికి విరుద్దమన్నారు. అలాగే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. తెలంగాణ సాధనలో స్వరాష్ట్రం కోరుకు జైపాల్ రెడ్డి పాటుపడ్డారని కొనియాడారు. జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.