ఇంగ్లీష్ భాష, ఉచ్ఛారణలపై పిల్లలకు ప్రత్యేక శిక్షణ
స్కూళ్లల్లో సదుపాయాలపై సమస్యలకు ఒక నెంబర్
నూతన విద్యావిధానం అమలు, చర్యలపై సిఎం జగన్ సమీ క్ష
అమరావతి, నవంబర్ 17 : రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లోఅవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం పక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్చేసేలా ఒక నంబర్ పెట్టాలని ఆదేశించారు. ప్రతి స్కూళ్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్ను ప్రదర్శించాలని, ఈ కాల్సెంటర్ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు, స్జబెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించారు. ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం పేర్కొన్నారు. దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టి పెట్టాలన్నారు. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూల్స్పై సీఎం జగన్కు అధికారులు వివరాలు అందించారు. మూడు విద్యా సంవత్స రాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు విలీనం చేశామని, 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ పక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందు బాటులోకి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. 1092 స్కూల్స్ 2021-22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగాయని అధికారులు వివరించారు. ఈ విద్యార్థులు 2024-25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉందని పేర్కొన్నారు. ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని అధికారులు తెలిపారు. టీచర్ ట్రైనింగ్ ఇస్తున్న డైట్ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని అన్నారు. టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని సూచించారు. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం అని సమావేశంలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని ప్రస్తావించారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథా ప్రకారం నడుపుకోవచ్చని మరోసారి స్పష్టం చేశారు.
విలీనం చేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని సూచించారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ పక్రియలో ఎక్కడా బలవంతం లేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని స్పష్టం చేశారు. మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన సదుపాయా లు అన్నది అందరి లక్ష్యం కావాన్నారు. అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్లో ట్యాప్లు పనిచేయక, నీళ్లు రాక… అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని, అలాంటి పరిస్థితులను నాడు-నేడు ద్వారా మార్చామని గుర్తు చేశారు. ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటు లో ఉండాలని తెలిపారు. పాఠశాలలకు హెడ్మాస్టర్లు కుటుంబ పెద్దలు అని, ఆ పాఠశాలల్లో నాణ్యమైన రీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు చేసి వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలన్నారు. ఆవిధంగా హెడ్ మాస్టర్లను చైతన్యం చేయాలని, ప్రతిరోజూ మానిటరింగ్ జరగాలని పేర్కొన్నారు. గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవా లని సీఎం ఆదేశించారు. పిల్లల నుంచి, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలిపారు.