మహారాష్ట్ర దగ్గర్లోని సతారా జిల్లా నయాగావ్ లో 1831 జనవరి 3న జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సులో జ్యోతిరావుపూలేను వివాహ మాడింది. సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఆమెకు చదువు నేర్పి సామాజిక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847లో నిమ్నకులాల బాలికలకోసం పూనేలో మొదట పాఠశాల ప్రారంభించారు. ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురైనా, ధైర్యంగా ‘నా విధి నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టువీడక సాగించిన ఉద్యమానికి తక్కువ కాలంలోనే గుర్తింపు లభించింది.పలువురు ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. అక్రమ సంతానంగా పుట్టిన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకుంది. 1852లో మహిళా సేవ మండల్ మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు.
1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు. 1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు జరిపించారు.
నరేష్ జాటోత్. ఎంఏ .బీఈడీ.కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)లేకుం
ప్లేగువ్యాధి సోకిన పేదలకు సేవలందించారు. ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించింది. 1897 మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్కాశీ సుభోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటి ప్రచురించారు. మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి హేతుబద్దత కవితల్లో ప్రతిబించించేవారు. సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.