Take a fresh look at your lifestyle.

సర్పంచే టీం లీడర్‌ ‌పెండింగ్‌ ‌పనులన్నీ పూర్తి చేయండి: మంత్రి హరీష్‌రావు

  • గ్రామ సర్పంచులకు మంత్రి హరీష్‌రావు హితవు
  • అధికారుల పర్యవేక్షణ కొరవడిందంటూ సుతిమెత్తని హెచ్చరిక

సిద్ధిపేట, జూలై 22 (ప్రజాతంత్ర బ్యూరో): గ్రామ అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేననీ, గ్రామాలలో పెండింగులో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హితవు పలికారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మంత్రి నివాసంలో గురువారం సిద్ధిపేట రూరల్‌ ‌మండలం లోని ప్రజాప్రతి నిధులు, మండల అధి కారులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి పనుల పురో గతిపై సుదీర్ఘంగా మంత్రి సమీక్షిం చారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచు లంతా టీమ్‌ ‌లీడర్‌గా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలని సూచించారు. పలు గ్రామాలలో చేపడుత్ను పనులపై అధికారులకు కనీస పర్యవేక్షణ కొరవడిందని పనితీరు మార్చుకోవాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్‌ ‌శాఖ అధికారులను మంత్రి సుతిమెత్తగా ఆదేశించారు.

మిషన్‌ ‌భగీరథ తాగునీరు, విద్యుత్‌, ‌వైకుంఠ ధామాలు, సెగ్రీ గేషన్‌ ‌షెడ్‌- ‌డంప్‌ ‌యార్డులు, పల్లె ప్రకృతివనం, కొత్త పంచాయతీ భవనాలు, గ్రామాల్లోని పలు కుల సంఘ భవనాల నిర్మాణాల ప్రగతి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని ఆయా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ ‌హుస్సేన్‌, ‌సుడా చైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌ ‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ‌ప్రభాకర్‌ ‌వర్మ, డిపివో పార్థసారథి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ‌శ్రీనివాసచారి, డిఈ నాగభూషణం, పంచాయతీ రాజ్‌ ‌శాఖ ఏఈ చారి, ఎంపిడివో సమ్మిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply