- అదనపు ఛార్జీలు లేకుండా బస్ సౌకర్యం
- అధికారులతో సక్షించిన ఎండి సజ్జన్నార్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని అన్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం
ఉందని, ఆయా రోజుల్లో పోలీస్, రవాణా అధికారులు సంస్థకు సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్,హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు.