Take a fresh look at your lifestyle.

పల్లె, పట్టణ ప్రగతి జూన్‌ 3‌కు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : పల్లె పట్టణప్రగతిని ఎండల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిని తిరిగి జూన్‌ 3 ‌నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌.. ‌జూన్‌ 3 ‌నుంచి  ప్రారంభించాలని సూచించారు.

Leave a Reply