రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ పై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లతో సమన్వయంచేసుకుంటూ ధరణి పోర్టల్లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
వాట్సాప్, ఈమెయిల్లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి,ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ధరణి పోర్టల్, ఇతర అంశాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్లసిఐజీహొహొహొ శేషాద్రి , ఆర్ధిక శాఖస్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖకార్యదర్శి రఘునందన్ రావు, ఐఆర్ఎస్ , ఎండీ జి.టివెంకటేశ్వర్ రావు, సి.సి.ఎల్.ఎ. ప్రత్యేక అధికారి సత్యశారదా తదితర అధికారులు పాల్గొన్నారని ప్రకటనలో పేర్కొన్నారు.