- పారిశుధ్య కార్మికులను సత్కరించిన పీసీసీ అధ్యక్షుడు
- రిపోర్టర్ మనోజ్ కుటుంబానికి 50 వేల ఆర్ధిక సహాయం చేసిన రాహుల్ గాంధీ జన్మదినం
- సందర్బంగా గాంధీభవన్ లో రక్తదాన శిబిరం : ఎన్ఎస్ యూఐ
ప్రజాతంత్ర, హైదరాబాద్ : గత వారం కరోనాతో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబ సభ్యులకు ఎన్ఎస్యుఐ విరాళంగా ఇచ్చిన రూ .50 వేల చెక్కును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదగా వారి కుటుంబ సభ్యునికి గాంధీభవన్ లో అందజేశారు.శుక్రవారం రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధిభవన్ లో అనిల్ అధ్యక్షతన హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ యొక్క పారిశుధ్య సిబ్బందిని సత్కరించారు మరియు ఆహార ధాన్యం సంచులను ఇచ్చారు. మరో 200 వందల మంది పేద ప్రజలకు ఆహార ధాన్యం సంచులను ఇచ్చారు.అలాగే ఎన్ఎస్యూఐ ఆధ్వరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ …ఐవైసి, ఎన్ఎస్యుఐ. ఇండో-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ యొక్క అమరవీరుల జ్ఞాపకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు.చైనా కి సరైన బుద్ధిచెప్పాలని ఉత్తమ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజాన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ యాదవ్, బలమూరి వెంకట్, తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.