ఖమ్మం,ఏప్రిల్28 ప్రజాతంత్ర (ప్రతినిధి) : కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రజా రవాణా, సరుకు రవాణా తదితర అంశాల పై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. మం గళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం..లాక్ డౌన్ అమలు తీరును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు వివరించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.