పెట్రోల్ బంకుల వద్ద పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపు
దేశవ్యాప్తంంగా నిరసనలకు ఎఐసిసి పిలుపు..ధరలను నిరసిస్తూ మంత్రులకు సైకిళ్లు పంపిన యూత్ కాంగ్రెస్
హైదరాబాద్ జూన్ 10 : కొరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ అడ్డగోలుగా పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.\
రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులు జిల్లా కేంద్రాలల్లోనూ, నియోజక వర్గ కేంద్రాలలో నియోజక వర్గ బాధ్యులు, మండల, పట్టణ కేంద్రాలలో ఆయా నాయకులు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గృహావసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. గత 13 నెలల్లో, పెట్రోల్పై లీటర్కు రూ.25.72, డీజిల్పై లీటరుకు 23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ పంపుల ముందు నేడు ఉదయం 11 గంటలకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు.
ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక మందగమనం, విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత, ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని. ఈ ప్రజా వ్యతిరేక అంశాలపై మనం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలలో సీనియర్ నాయకులు, ఎంపిలు, ఎంఎల్ఎఎస్/ఎంఎల్సిఎస్, ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాలన్నీ అధికారులు నిర్దేశించిన కోవిడ్ -19 ప్రోటోకాల్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మాస్క్లు ధరించి, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంంగా నిరసనలకు ఎఐసిసి పిలుపు..ధరలను నిరసిస్తూ మంత్రులకు సైకిళ్లు పంపిన యూత్ కాంగ్రెస్
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ బంకుల ముందు నిరసనలకు దిగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పిసిసిలను ఎఐసిసి ఆదేశించింది. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 11న పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఆందోళనలు చేపట్టాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల పీసీసీలను ఏఐసీసీ ఆదేశించింది. కొరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పెట్రో ధరలను కేంద్రం పెంచుతూనే ఉందని, గత 13 నెలల్లో లీటరు పెట్రోల్పై రూ. 25.72, డీజిల్పై 23.93 మేరకు ధరలు పెంచడం దారుణమని మండిపడింది.
ప్రజా దోపిడీకి ఇదో ఉదాహరణ అని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ యువజన విభాగం వినూత్నంగా నిరసన తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులకు కొరియర్ ద్వారా సైకిళ్లను పంపించింది. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఐవైసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ, ఐవైసీ కార్యకర్తలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ ఐవైసీ కార్యకర్తలు అద్దాలు చూపిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హావి•లను గుర్తు చేస్తూ సర్కారును నిలదీశారు. కాగా సైకిళ్లను అందుకున్న వారిలో కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నారు.