- ఏపి మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతుల అరెస్ట్
- కిడ్నాప్కు గురైన వారిని క్షేమంగా రక్షించిన పోలీసులు
హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్తో పాటు సునీల్, నవీన్ను కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్స్టేషన్లో అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల నుంచి ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కాపాడారు. అయితే ఈ కేసులో తనపై వొస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అఖిల ప్రియ తెలిపారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్కు కిడ్నాప్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు డియాకు తెలుపుతానన్నారు.
ఒక వైపు వాదనలు విని… తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని డియాను కోరారు. డియా అంటే తమ కుటుంబానికి చాలా గౌరవం ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. ఇదిలా ఉంటే, బోయినపల్లిలో కిడ్నాప్కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వొదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్ సోదరి తరఫు సప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్రావు కిడ్నాప్కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్లను వికారాబాద్లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ సోదరుడు చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హఫీజ్పేటలో ఉన్న భూమికి సంబంధించి ప్రవీణ్రావు కుటుంబానికి, అఖిలప్రియ కుటుంబానికి వివాదాలు నడుస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారులమంటూ ప్రవీణ్రావు ఇంట్లోకి ప్రవేశించారు. వారిని ప్రశ్నించాలంటూ ప్రవీణ్తో పాటు అతని సోదరులు సునీల్, నవీన్ను వాహనంలో తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ప్రవీణ్ను అపహరించారంటూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.
సీసీకెమెరాలను పరిశీలించి వారిని తీసుకెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రవీణ్తో పాటు అతని సోదరులను నార్సింగి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. మోయినాబాద్ వైపు కిడ్నాపర్లు పారిపోతుండగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అఖిలప్రియ, భార్గవరామ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.