- బండి సంజయ్కు ప్రధాని మోడీ ఫోన్..ఎన్నికల తీరుపై ఆరా
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఎంసీ ఎన్నికల గురించి ఆరా తీసారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బుల పంపకం, దౌర్జన్యాల గురించి మోడీ తనను వివరాలు అడిగారని, టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని,. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా పనిచేసిన బీజేపీ రాష్ట్రశాఖకు మోడీ శుభాకాంక్షలు చెప్పారని అన్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోదీ అభినందించినట్టు పేర్కొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారని, నాయకుల, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు అడిగారని సంజయ్ తన ప్రకటనలో చెప్పారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని మోదీ కొనియాడారన్నారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారన్నారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హావి• ఇచ్చారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించినట్టు తెలిపారు.