బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. 45 ఏళ్లు దాటి..వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత టీకాలను ఇస్తున్నారు.
ప్రధాని మోదీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే కోవిడ్ టీకాను తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకోవాలనుకునేవారు.. తొలుత కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.