Take a fresh look at your lifestyle.

మహిళల హాకీలో పతకాన్ని చేజార్చుకున్నా.. జట్టు ‘న్యూ ఇండియా’ స్ఫూర్తికి అద్దం పడుతుంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
మహిళల హాకీలో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం..అయితే ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సరికొత్త సీమలలో ప్రవేశించడం’’ అనే ‘న్యూ ఇండియా’ తాలూకూ స్ఫూర్తికి ఈ జట్టు అద్దం పట్టింది..అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020‌లో మన మహిళల హాకీ జట్టు ఇచ్చిన గొప్ప ప్రదర్శనను మనం ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటామని కూడా ఆయన అన్నారు. ‘‘మరింత ముఖ్య విషయం ఏమిటంటే అది ఒటింపిక్స్ 2020‌లో వారి సాఫల్యం భారతదేశం యువ పుత్రికలకు హాకీని ఎంచుకొని, ఆ క్రీడలో రాణించాలనే ప్రేరణను అందిస్తుందనేదే. ఈ జట్టును చూస్తే గర్వం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి తన ట్వీట్‌లలో పేర్కొన్నారు.

Leave a Reply