హైదరాబాద్ ,మే 25: రాష్ట్రంలో . లాక్ డౌన్ ఆంక్షలు అమలు నేపథ్యంలో కొరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయనుకుంటున్న క్రమంలో మంగళ వారం పాజిటివ్ కేసులు మళ్ళీ పెరిగాయి. ఆదివారం 2242 ,సోమవారం 3043 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..మంగళ వారం 3 వేల 821 కేసులు నమోదు అయినట్లు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 23 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు.
మొత్తం 81 వేల 203 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 3 వేల 821 మందికి కొరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 298 మంది కొరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా హాస్పిల్స్ నుండి డిశ్చార్జ్ కాగా 23మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 38వేల 706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 89.2 శాతం ఉండగా తెలంగాణలో 92.52 శాతం నమోదు అయింది.