కొరోనా కారణంగా 17 మంది మృతి
రాష్ట్రంలో కొరోనా వైరస్ తగ్గుతున్న క్రమంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 మందికి పాజిటివ్గా నమోదయింది. వైరస్ నుంచి 1801 మంది కోలుకోగా, మహామ్మారి కారణంగా 17 మంది మృతి చెందారు. ఖమ్మంలో కొత్తగా 180 కేసులు నమోదవగా, జిహెచ్ఎంసి పరిధిలో 179 కేసులు, నల్గొండ జిల్లాలో 145 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 5,96,813 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,426కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,69,086 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 24,301గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.