హుజూరాబాద్ ఉప ఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న కౌంటింగ్ అక్టోబర్ 1న నోటిఫికేషన్ 8 వరకు నామినేషన్లు..11న పరిశీలన షెడ్యూలు విడుదల చేసిన ఈసీ ఎపిలో బద్వేలు, దేశ వ్యాప్తంగా 28 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసింది. వొచ్చే నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న వోట్ల లెక్కింపు…ఆ వెంటనే ఫలితం వెలువడనుంది. హుజూరాబాద్తో పాటు ఆంధప్రదేశ్లోని బద్వేలు నియోజకవర్గానికి, దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది. హుజూరాబాద్లో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టిఆర్ఎస్, విపక్ష బిజెపిలుపోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. ఇకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడం, ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీష్ రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ ఆమన విసిరారు. ఇక హుజూరాబాద్ వేదికగా దళితబంధుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడక్కడ ఈ పథకం కింది ఒక్కో కుటుంబానికి పదిలక్షలు అందుతున్నాయి. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
- నవంబర్ 2న కౌంటింగ్
- అక్టోబర్ 1న నోటిఫికేషన్
- 8 వరకు నామినేషన్లు..11న పరిశీలన
- షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
- ఎపిలో బద్వేలు, దేశ వ్యాప్తంగా 28 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ను విడుదల చేసింది. వొచ్చే నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న వోట్ల లెక్కింపు…ఆ వెంటనే ఫలితం వెలువడనుంది. హుజూరాబాద్తో పాటు ఆంధప్రదేశ్లోని బద్వేలు నియోజకవర్గానికి, దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది. హుజూరాబాద్లో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టిఆర్ఎస్, విపక్ష బిజెపిలుపోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది.
ఇకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడం, ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీష్ రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ ఆమన విసిరారు. ఇక హుజూరాబాద్ వేదికగా దళితబంధుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడక్కడ ఈ పథకం కింది ఒక్కో కుటుంబానికి పదిలక్షలు అందుతున్నాయి. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.