హైదరాబాద్,ప్రజాతంత్ర,మే16: ‘తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’ రాష్ట్ర చైర్మెన్గా.. తెలంగాణ ఉద్యమ కారుడు, మత్స్యరంగ నిపుణుడు పిట్టల రవీందర్ను,వైస్ చైర్మన్ గా.. గంగ పుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.