![]() |
ReplyForward
|
*కేంద్రం మార్గదర్శకాలు విడుదల..
*విద్యాలయాల్లో అణువణువునా పరిశుభ్రత..
కొరోనా వైరస్ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది..
తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి తల్లిదండ్రుల అనుమతితో ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలలకు రావడానికి కేంద్రం అనుమతించిన విషయం విదితమే. తరగతి గదుల నిర్వహణ, రవాణా సదుపాయాలతో పాటు పాఠశాలల్లో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపింది.
*పాఠశాలల పునఃప్రారంభానికి ముందస్తు ప్రణాళిక..
కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు. కంటైన్మెంట్ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు.
* పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేయాలి.
* క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్ చేయాలి.
* ఉపాధ్యాయులు, సిబ్బంది 50శాతం మంది హాజరయ్యేలా చూడాలి.
* 9-12 విద్యార్థులకు భౌతికంగా లేదా వర్చువల్ తరగతులకు హాజరయ్యే ఐచ్ఛికం ఇవ్వాలి. భౌతికంగా హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
* బయో మెట్రిక్ హాజరు పద్దతి అవసరం లేదు.
* ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి.
* ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి.
* ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి.
* సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు నిషేధం
* ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్లైన్ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి.
* తరగతి గదుల్లో ఏసీ, వెంటిలేషన్ తదితర అంశాల్లో సంబంధిత మార్గదర్శకాలు అమలుచేయాలి.
* విద్యార్థులు లాకర్లు ఉపయోగించొచ్చు.*స్విమ్మింగ్ పూల్ తప్పని సరిగా మూసివేయాలి.
*పాఠశాలలు తెరిచిన తర్వాత
* విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ ఉండాలి.* కొరోనా లక్షణాలు లేనివారిని అనుమతించాలి.* కొరోనా జాగ్రత్తలకు సంబంధించి గోడపత్రికలు డిస్ప్లే చేయాలి.* ఏ ప్రాంతంలోనూ ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.* సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
*తరగతి గదుల్లో
* విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి.* తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి.* నోట్బుక్, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి.
*ప్రయోగశాలల్లో
* ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్ సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి.* ఉపయోగించే పరికరాలన్నిటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.* పరికరాలు ఉపయోగించే ముందు తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
Prev Post